విశ్వబ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గం
NEWS Sep 13,2026 10:13 pm
కథలాపూర్ మండల విశ్వబ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా పడకంటి శ్రీధర్, ఉపాధ్యక్షుడిగా కాసోజీ ప్రతాప్, ప్రధాన కార్యదర్శిగా అందె రాజశేఖర్, కోశాధికారిగా గాండ్లోజి నరేష్బాబు, కార్యనిర్వాహక సభ్యుడిగా చిర్లవంచ సాయికిరణ్ ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా పొన్నోజి ప్రభు, మురళి, భూమయ్య, రాములు, పురుషోత్తం, నాగేందర్, రమేష్, ప్రభాకర్, జగదీష్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడు పడకంటి శ్రీధర్ మాట్లాడుతూ సంఘ అభివృద్ధితో పాటు సభ్యుల సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు. సంఘ సభ్యులందరి సహకారంతో ఐక్యంగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు.