దిల్లీ: బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా భారత్ మండపం ఆవరణలో ఆసక్తికర సన్నివేశం. ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ సహా బ్రిక్స్ దేశాల అగ్రనేతలు కలిసి మర్రి మొక్కలు నాటి, వాటికి నీళ్లు పోశారు. ఈ దృశ్యాలు ఆకట్టుకున్నాయి. భారతీయ నాగరికత, సంస్కృతిలో మర్రి చెట్టుకు విశిష్ట ప్రాధాన్యం ఉందని, పర్యావరణ సుస్థిరతను పెంపొందించడంతో పాటు భావితరాలకు హరిత వారసత్వాన్ని అందించాలనే బ్రిక్స్ దేశాల సమష్టి సంకల్పానికి ఈ కార్యక్రమం ప్రతీకగా నిలిచిందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ చెప్పారు.