మహిళల భద్రతకు బాధ్యతగా వ్యవహరించాలి
NEWS Sep 12,2026 10:56 pm
నేరాలు,అఘాయిత్యాలు పెరుగుతున్న నేటి కాలంలో సమాజంలో మహిళల భద్రత కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, ముందస్తు జాగ్రత్తలతోనే నేరాలను అదుపు చేయవచ్చని వరంగల్ షీ టీమ్ ఎస్సై రామారావు పేర్కొన్నారు. హన్మకొండలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో దాదాపు 100 మంది విద్యార్థినులకు మహిళల భద్రత, టీ-సేఫ్ యాప్ వినియోగం, సైబర్ నేరాలపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై రామారావు మాట్లాడుతూ విద్యార్థినులు, మహిళలు పాటించాల్సిన పలు ముఖ్యమైన జాగ్రత్తలను వివరించారు.