జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది.నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఈనెల 11న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి మల్లయ్య తెలిపారు. ఈ మేళాలో ఆదర్శ ఆటోమొబైల్స్, గ్రీన్ హోండా కపిల్ మోటార్స్ కంపెనీలు పాల్గొనన్నట్లు చెప్పారు. అందులో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి మేళా ఉంటుందన్నారు. ఇందుకు ఏదైనా డిగ్రీ చదివిన అభ్యర్థులు అర్హులని ఎంపికైన వారికి నెలకు రూ.15వేల వరకు వేతనం ఉంటుందని చెప్పారు. మరిన్ని వివరాలకు 9502468800 నెంబర్ ను సంప్రదించాలన్నారు.