పోషకాహార లోపాల నివారణకు కృషి చేయాలి
NEWS Sep 10,2026 09:00 am
పోషకాహార లోపం,రక్తహీనత నివారణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు.హనుమకొండ కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో జాతీయ పోషణ మాసంపై జిల్లా మహిళా, శిశు సంక్షేమ వైద్య ఆరోగ్య పలు శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 8 వరకు నిర్వహించే జాతీయ పోషణ మాసం ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు. పోషకాహార లోప నివారణకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.