మా మహిళా నాయకురాళ్లపై దాడి వెనుకున్నది రేవంత్ రెడ్డే: కేటీఆర్
NEWS Sep 07,2026 11:47 pm
మా సునీతా లక్ష్మారెడ్డిపై అక్కడ ఇనుప కంచె గ్రిల్స్ మీద పడే పరిస్థితి. ఇవాళ ఆమెకేమన్నా అయి ఉంటే ఏం జరిగి ఉండేదో నాకు తెలియదు కానీ.. ఇది శాసన సభ కాదు దుశ్శాన సభ అన్నట్టుగా ఇవాళ వ్యవహరించి చివరకు మా సునీతా లక్ష్మారెడ్డి కండ్ల వెంబడి కంటనీరు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఒక మగ పోలీసు ఆమె గొంగు పిసికే ప్రయత్నం చేశారు. ఇది మొత్తం రాష్ట్రం చూసింది. దీనికి బాధ్యుడు, దీని వెనకాల ఉన్నది స్పష్టంగా రేవంత్ రెడ్డి తప్ప ఇంకెవరినో కాదు.. అని మండిపడ్డారు.