మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్టించాలి
NEWS Sep 07,2026 11:35 pm
మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్టించి పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ కోరారు. హనుమకొండ కలెక్టరేట్ లో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు, సిబ్బందికి మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. అనంతరం ఇందుకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. ప్రతి ఒక్కరు మట్టి విగ్రహాలనే పూజించి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.