కూతురి శవం వెంటే కన్నుమూసిన తల్లి!
NEWS Sep 04,2026 11:14 pm
కరీంనగర్ రూరల్ మండలం దురిశేడు గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కూతురు శ్రీవిద్య ఆత్మహత్య చేసుకోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన తల్లి బిల్లా సవిత (65) గుండెపోటుతో మరణించింది. కూతురి అంతిమ యాత్ర సాగుతుండగా తల్లికి ఒక్కసారిగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కన్నుమూసింది. ఒకే రోజు తల్లి, కూతుళ్లు ఇద్దరూ మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.