ఉప్పుమడుగు KGBV ఎస్.ఓ శోభారాణికి ప్రతిష్టాత్మక అవార్డు ప్రదానం
NEWS Sep 03,2026 10:09 pm
రాయికల్: విద్యారంగంలో సేవలకుగానూ ఉప్పుమడుగు KGBV ఎస్.ఓ శోభారాణికి 'టపాస్' జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించింది. TPUS జగిత్యాల జిల్లా శాఖ ప్రతినిధులు ఆమెను శాలువాతో సత్కరించి పురస్కారాన్ని అందజేశారు. ఈ గౌరవంతో విద్యార్థులకు మరింత అంకితభావంతో సేవ చేస్తానని ఎస్.ఓ శోభారాణి సంతోషం వ్యక్తం చేశారు.