ఉక్రెయిన్ దాడిలో జగిత్యాల వాసి మృతి
NEWS Sep 03,2026 12:18 pm
ఉక్రెయిన్పై రష్యా చేసిన భారీ దాడిలో జగిత్యాల జిల్లా హస్నాబాద్ గ్రామానికి చెందిన వావిలాల సుదర్శన్గౌడ్ (42) మృతి చెందాడు. మంగళవారం ఉదయం తాను నివాసం ఉంటున్న గది నుంచి బయటకు వచ్చిన సమయంలోనే ఈ దాడి జరగడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. సుదర్శన్గౌడ్ 4 నెలల క్రితమే ఉపాధి నిమిత్తం ఉక్రెయిన్ వెళ్లాడు. మంగళవారం తెల్లవారుజామున కీవ్ సహా పలు ప్రాంతాలపై క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 12 మంది ప్రాణాలు కోల్పోయారు.