శిరీష కుటుంబానికి అండగా ఉంటానని కేటీఆర్ హామీ
NEWS Sep 03,2026 11:51 am
ములకలపల్లి మండలం చౌటిగూడెం గ్రామానికి చెందిన నర్సు ఊకే శిరీష కుటుంబాన్ని బుధవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్లో పరామర్శించారు. కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కేటీఆర్ సూచనల మేరకు రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించి రూ.50 వేల ఆర్థికసాయం అందించారు.