విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి
NEWS Sep 02,2026 10:49 pm
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా ఎందుకు నిర్వహించడం లేదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్ రావు ప్రశ్నించారు. పరకాలలో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవ వారోత్సవాల వేడుకల్లో రామచంద్ర రావు పాల్గొని అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడంతో పాటు సెప్టెంబర్ 17 గొప్పతనాన్ని పాఠ్యపుస్తకాల్లో చేరుస్తామని ప్రకటించారు.