పవన్ జన్మదిన సందర్భంగా రక్తదానం
NEWS Sep 02,2026 05:50 pm
జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 55వ జన్మదినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. కామారెడ్డి పట్టణంలోని కేబీఎస్ బ్లడ్ బ్యాంకులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొని రక్తదానం చేశారు. కామారెడ్డి నియోజకవర్గానికి చెందిన జజారి దినేష్, కుమార్, రవితేజ, కర్ణాకర్, ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చెందిన పళ్లెం అరవింద్, రాజు, రవితేజ, సూర్య, రోహన్, రాజు, చరణ్ తదితరులు పాల్గొన్నారు.