పోలీసులకు రాఖీలు కట్టిన విద్యార్థినులు
NEWS Aug 28,2026 10:39 am
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, బాలికల జూనియర్ కళాశాలల్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా విద్యార్థినులు వన్ టౌన్, టూ టౌన్ పోలీసు స్టేషన్లను సందర్శించారు. నిరంతరం ప్రజల రక్షణ కోసం శ్రమిస్తున్న పోలీసు అధికారులకు, సిబ్బందికి రాఖీలు కట్టి, మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో నిలిచే పోలీసు సోదరులకు అభినందనలు తెలియజేశారు.