పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత: కలెక్టర్ చిత్రా మిశ్రా
NEWS Aug 26,2026 09:33 am
కరీంనగర్: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం పిలుపునిచ్చారు. మంగళవారం ముకరాంపుర ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన వన మహోత్సవంలో వారు మొక్కలు నాటారు. విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు ఇటువంటి కార్యక్రమాలు తోడ్పడతాయన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ పడాల శ్రీజ, ఇన్స్పెక్టర్లు రామచందర్రావు, సృజన్రెడ్డి పాల్గొన్నారు.