కోదాడ: రోడ్డు ప్రమాదంలో ఆరుగురి మృతి
NEWS Aug 26,2026 10:21 am
సూర్యాపేట జిల్లా కోదాడ (M) దొరకుంటలో హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేటు బస్సు.. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు తెల్లవారుజామున 4 గంటల సమయంలో ప్రమాదానికి గురైంది. రోడ్డు ప్రమాద ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సీఎస్ను ఆదేశించారు