రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు: కలెక్టర్
NEWS Aug 25,2026 03:53 pm
కరీంనగర్: ప్రజల భద్రత విషయంలో రాజీ పడకుండా రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రమాదకర ప్రదేశాలను గుర్తించి సీసీ ప్యాచ్ వర్క్, డ్రైనేజీల మరమ్మతులు చేపట్టాలని, రోడ్డు పక్కన నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఫ్లెక్సీలను తొలగించి, హిట్ అండ్ రన్ బాధితులకు తక్షణ పరిహారం అందించాలని సూచించారు. సమావేశంలో సీపీ గౌస్ ఆలం పాల్గొన్నారు.