కేరళకు చెందిన 19 ఏళ్ల లా (ఆనర్స్) విద్యార్థిని కజియా లిజ్ మెజో \'మిస్ యూనివర్స్ ఇండియా 2026\' కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. జైపూర్లో జరిగిన గ్రాండ్ ఫినాలేలో ఉన్న 52 మంది తుది పోటీదారులపై విజేతగా నిలిచారు. ఈ ఏడాది నవంబర్లో పోర్టో రికోలో జరిగే 75వ \'మిస్ యూనివర్స్\' అంతర్జాతీయ పోటీల్లో కజియా భారత్ తరఫున మెజో ప్రాతినిధ్యం వహిస్తారు. కేరళ నుంచి జాతీయ కిరీటాన్ని దక్కించుకున్న తొలి మహిళ.