విజయసాయిరెడ్డి కొత్త పార్టీకి ముహూర్తం
NEWS Aug 24,2026 08:53 pm
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తాను కొత్త పార్టీని ప్రారంభించపోతున్నట్టు ప్రకటించారు. శ్రావణమాసం మూడో శుక్రవారం నాడు తన నూతన రాజకీయ పార్టీకి సంబంధించిన పేరు, జెండా, విధివిధానాలు తదితర పూర్తి ప్రణాళికను తెలియజేస్తానని, విజయవాడ వేదికగా అధికారికంగా ప్రకటన చేస్తానని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ మాత్రమే ఏకైక ప్రతిపక్షంగా ఉందన్నారు. సాధారణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, వారి సమస్యలను నేరుగా సభల వరకు తీసుకెళ్లేందుకు ఒక బలమైన స్వతంత్ర రాజకీయ వేదికను ఏర్పాటు చేస్తానన్నారు.