ట్రాఫిక్ ఏసీపీ కార్యాలయంలో సీపీ తనిఖీ
NEWS Aug 24,2026 08:38 pm
కరీంనగర్: నగరంలోని ట్రాఫిక్ ఏసీపీ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం వార్షిక తనిఖీలు నిర్వహించారు. రికార్డులు, సిబ్బంది విధుల నిర్వహణను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. నగరంలో ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, వాహనదారులకు ఇబ్బంది కలగకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ యాదగరిస్వామి, సీఐలు పాల్గొన్నారు.