శాంతియుతంగా మిలాద్ ఉన్ నబి జరుపుకోవాలి: సీపీ గౌష్ ఆలం
NEWS Aug 24,2026 07:22 pm
కరీంనగర్: మిలాద్ ఉన్ నబిని ప్రశాంతంగా జరుపుకోవాలని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం కోరారు. మర్కజీ, సున్నీ, అన్వార్ ఉలూమ్ కమిటీల పెద్దలతో ఆయన సమావేశమయ్యారు. భద్రతా ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. జులూస్ ఊరేగింపు షరతులకు లోబడి నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్లు రాంచందర్ రావు, సృజన్ రెడ్డి, తిరుమల్ గౌడ్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.