ఎకరం భూమి ధర అక్షరాలా రూ.264 కోట్లు
NEWS Aug 22,2026 11:25 am
హైదరాబాద్లో భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రాయదుర్గంలోని పాన్మక్తా ప్రాంతంలో ఎకరం భూమి రికార్డు స్థాయిలో రూ.264 కోట్లకు అమ్ముడైంది. సర్వే నంబర్ 83/1లోని 5.25 ఎకరాలను టీజీఐఐసీ నిర్వహించిన వేలంలో ఎంఎస్ఎన్ రియాలిటీ సంస్థ దక్కించుకుంది. దీంతో ప్రభుత్వానికి రూ.1,381 కోట్ల ఆదాయం సమకూరింది. ఇదే ప్రాంతంలో మే నెలలో ఎకరం రూ.237 కోట్లకు అమ్ముడవగా, మూడు నెలల్లోనే ధర రూ.27 కోట్లు పెరిగింది. ఐటీ కారిడార్గా వేగంగా అభివృద్ధి చెందుతున్న రాయదుర్గంలో భూములకు భారీ డిమాండ్ కొనసాగుతోంది.