కేసుల పరిష్కారంపై సీపీ గౌష్ఆలం సమీక్ష
NEWS Aug 22,2026 04:42 pm
కరీంనగర్: కోర్టు విధులు, సమన్లు, వారెంట్ల అమలును వేగవంతం చేయాలని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం అధికారులను ఆదేశించారు. కమిషనరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ సాంకేతికతతో వారెంట్లను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. రాబోయే లోక్ అదాలత్ ద్వారా గరిష్ట సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని సూచించారు.