మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడు దేవిరెడ్డి శివశంకర్రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్యరెడ్డిని ఈడీ అధికారులు శుక్రవారం రెండు గంటలపాటు విచారించారు. కడప నుంచి పులివెందులకు పిలిపించి ఆయనను ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. దస్తగిరిని బెదిరించారన్న ఆరోపణలపై నమోదైన కేసుకు సంబంధించి ఈ విచారణ జరిగినట్లు తెలిసింది. మరోవైపు పులివెందులలో ఎంపీ అవినాష్రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. లెక్కలు చూపని 24 లక్షల నగదును, కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. వివిధ ఆస్తుల పత్రాలపై వైఎస్ మనోహర్రెడ్డిని కూడా ప్రశ్నించింది.వివేకాని హతమార్చేందుకు దేవిరెడ్డి శివశంకర్రెడ్డి రూ.40 కోట్లు ఆఫర్ చేసినట్లు దస్తగిరి వెల్లడించారని ED పేర్కొంది. ఆ మొత్తం నుంచి తనకు రూ.5 కోట్లు వాటాగా ఇస్తానని ఎర్ర గంగిరెడ్డి ప్రలోభపెట్టినట్లు దస్తగిరి చెప్పిన విషయాన్ని కూడా ED ప్రస్తావించింది.దస్తగిరి జైలులో ఉండగా చైతన్యరెడ్డి బెదిరించినట్టు కూడా గతంలో పోలీసులకి దస్తగిరి ఫిర్యాదు చేశారు.