సన్నబియ్యం.. కిలో రూ.50కే!
NEWS Aug 22,2026 09:43 am
AP: కూటమి ప్రభుత్వం రేషన్ కార్డు లేకపోయినా సన్న బియ్యం కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించింది. ఆధార్ కార్డు చూపించి ప్రత్యేక కౌంటర్లలో బియ్యం పొందవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా 130 రైతు బజార్లు, రైస్ మిల్లుల వద్ద ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. BPT ముడి బియ్యం కిలో రూ.50, స్టీమ్డ్ రైస్ కిలో రూ.52 చొప్పున విక్రయిస్తున్నారు. మార్కెట్లో సన్న బియ్యం ధరలు కిలో రూ.60-65 వరకు ఉండటంతో సామాన్యులకు ఉపశమనం కల్పించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు తొలివారం నుంచి రేషన్ కార్డుదారులకు అమలు చేసిన ఈ విధానాన్ని ఇప్పుడు అందరికీ వర్తింపజేస్తున్నారు.