శ్రావణమాసం రెండో శుక్రవారం సందర్భంగా అనకాపల్లిలో నూకాలమ్మ.. ధనలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చారు. రూ.10 లక్షల విలువైన కరెన్సీ నోట్లతో అమ్మవారిని ఆలయ సిబ్బంది అందంగా అలంకరించారు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా మహిళలు పెద్దఎత్తున ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు.