సీఎం పర్యటనకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు
NEWS Aug 21,2026 09:27 pm
అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం ఎ.కోడూరులో ఈనెల 22న సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో విశాఖ రేంజ్ ఐజీ గోపినాథ్ జట్టి, అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమ ప్రాంగణం, హెలిప్యాడ్, వీఐపీ రూట్ను తనిఖీ చేశారు. బందోబస్తు సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని, శాఖల మధ్య సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి పాల్గొన్నారు.