చిన్నకల్లగుంటలో పోలీసుల పల్లెనిద్ర
NEWS Aug 21,2026 08:44 am
కొండేపి మండలం చిన్న కల్లగుంట గ్రామంలో గురువారం రాత్రి పోలీసులు పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. కొండేపి సీఐ రమణయ్య ఆదేశాల మేరకు ఎస్సై త్యాగరాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. గ్రామంలోని పెద్దలు, స్థానికులతో ఎస్సై ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని ఎస్సై త్యాగరాజు కోరారు. గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆయన తెలిపారు.