పాఠశాల అభివృద్ధికి సహకరిస్తా: డా. పైడి
NEWS Aug 21,2026 10:49 am
దేవాయిపల్లి ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డా. పైడి ఎల్లారెడ్డి తెలిపారు. గ్రామానికి అవసరమైనవి అడిగే హక్కు గ్రామస్తులకు ఉంటే.. వాటిని సమకూర్చాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. గ్రామస్తుల కోరిక మేరకు శిథిలావస్థకు చేరిన ఆలయాన్ని పునర్నిర్మించినట్లు గుర్తుచేశారు. పాఠశాలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అయితే రాజకీయాలకు అతీతంగా పాఠశాలను ఎక్కడ నిర్మించాలనే విషయాన్ని గ్రామస్తులే నిర్ణయించాలని సూచించారు. తాను సేవాభావంతో రాజకీయాల్లో కొనసాగుతున్నానని డా. పైడి ఎల్లారెడ్డి పేర్కొన్నారు.