ఉపన్యాస పోటీల ప్రచార పత్రం విడుదల
NEWS Aug 21,2026 08:47 am
మాగనూరు మండలం మందిపాల్ గ్రామంలోని అప్పర్ ప్రైమరీ పాఠశాలలో పర్యావరణ పరిరక్షణ ఉపన్యాస పోటీలకు సంబంధించిన ప్రచార పత్రాన్ని ఎం.జె.పి.వి.సి. మక్తల్ అసెంబ్లీ మహిళా విభాగం అధ్యక్షురాలు యాంకే పద్మ విడుదల చేశారు. ఆమె మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణపై విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు నిర్వహిస్తున్న ఉపన్యాస పోటీ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పర్యావరణాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎం.జె.పి.వి.సి. నాయకులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.