తిరుమల శ్రీవారి హుండీ గలగల
NEWS Aug 20,2026 02:23 pm
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి హుండీ ఆదాయంలో సరికొత్త రికార్డు క్రియేట్ అయ్యింది. హుండీ ఆదాయంలో మంగళవారం రూ.6 కోట్ల మార్క్ దాటేసింది. మంగళవారం ఒక్కరోజే రూ.6.12 కోట్ల ఆదాయం వచ్చింది.మంగళవారం శ్రీవారిని 80,905 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారికి 33,539 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. తిరుమలలో భక్తుల రద్దీ కొద్దిరోజులుగా భారీగా నమోదవుతోంది. తరచూ వేల సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. వర్షాకాలం అయినప్పటికీ వాతావరణం అనుకూలంగా ఉండటంతో భక్తులు తిరుమల స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మంగళవారం 4.16 లక్షల లడ్డూలను విక్రయించగా.. 2.88 లక్షలమంది అన్నప్రసాదం స్వీకరించారు. చాలా కాలం తర్వాత శ్రీవారి హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. సాధారణంగా బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ద్వార దర్శనా సమయంలోనే ఇంత భారీగా ఆదాయం వస్తుంది.