'ప్రశ్నించలేని ప్రజలు.. పట్టించుకోని నాయకులు'
NEWS Aug 20,2026 04:14 pm
కరీంనగర్: తీగలగుట్టపల్లి రైల్వే గేటు వద్ద నెమ్మదిగా సాగుతున్న ఆర్ఓబీ పనులపై నిరసన వ్యక్తమైంది. అక్కడ ఏర్పాటు చేసిన ఓ డిజిటల్ ఫ్లెక్సీ స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. “ప్రశ్నించలేని ప్రజలు.. పట్టించుకోని నాయకులు”, “అభివృద్ధిని ఆపొద్దు.. బాధ్యత మనందరిదీ” వంటి పది రకాల ఘాటైన కొటేషన్లతో ఓ అజ్ఞాత వ్యక్తి దీనిని రూపొందించారు. గాలిలో లేచే దుమ్ముతో విద్యార్థులు, వాహనదారులు పడుతున్న నరకయాతనను ఎత్తిచూపుతూ ప్రజలను చైతన్యపరిచేలా ఉన్న ఈ నిరసన ప్లకార్డు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.