కారులో వెళ్తుండగా ఘోర ప్రమాదం.. నలుగురి మృతి
NEWS Aug 20,2026 04:13 pm
సిద్దిపేట జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. దుబ్బాక మండలం బల్వంతాపూర్కు చెందిన దండుగుల రాజు (30), భార్య భాగ్య (25), పిల్లలు నిహాన్ష్ (4), శాన్విక (2) కారులో సిద్దిపేట నుంచి ఇంటికి వెళ్తుండగా అప్పనపల్లి శివారులో అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది జేసీబీ సాయంతో కారును బయటకు తీశారు. ప్రమాదంలో నలుగురూ మృతి చెందడంతో గ్రామంలో విషాదం అలుముకుంది.