బొడ్డేడ ప్రసాద్ను కలిసిన YCP నేతలు
NEWS Aug 19,2026 11:38 am
మునగపాక పార్టీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు, పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ను పెందుర్తి నియోజకవర్గం స్టూడెంట్ విభాగం అధ్యక్షుడు నమ్మి రమేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతో పాటు వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు దాడి ఉమామహేశ్వరరావు, గౌతమ్, యూత్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ పరిస్థితులు, భవిష్యత్ కార్యక్రమాలపై చర్చించినట్లు తెలిపారు.