జగిత్యాల రూరల్ మండలం పొలాస-తిమ్మాపూర్ అనుసంధాన రహదారి అధ్వానంగా మారింది. రోడ్డుపై పలుచోట్ల గుంతలు ఏర్పడి, చిన్నపాటి వర్షానికే నీరు నిలుస్తోంది. దీంతో వాహనదారులు, ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా మార్పు లేదని వారు వాపోతున్నారు. గుంతల కారణంగా వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి నూతనంగా తారురోడ్డు నిర్మించాలని పొలాస-తిమ్మాపూర్ గ్రామ ప్రజలు కోరుతున్నారు.