పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాల పరిశీలన
NEWS Aug 18,2026 08:29 pm
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కసింకోట ఎంపీడీవో చంద్రశేఖరరావు అచ్చర్ల, సుందరయ్యపేట, కన్నూరుపాలెం, తాళ్లపాలెం గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రాల్లో విద్యుత్, తాగునీరు, ఫర్నిచర్, ర్యాంప్ తదితర మౌలిక సదుపాయాలను తనిఖీ చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రాన్ని సమగ్రంగా పరిశీలించి, అవసరమైన వివరాలతో నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తామని ఎంపీడీవో తెలిపారు.