నర్సంపేటలో పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు హేయమైన చర్య అని శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదన చారి తీవ్రంగా ఖండించారు. మధుసూదనాచారి మాట్లాడుతూ పెద్దికి ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే ప్రభుత్వం ఈ చర్యలకు పాల్పడిందని ఆరోపించారు. ఉద్యమ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని గుర్తుగా ఏర్పాటు చేసుకుంటే ఇలా తొలగించడం దుర్మార్గం అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడడం సరికాదని హితవు పలికారు.