ఉపాధి పని కల్పించాలంటూ గిరిజనుల వినూత్న నిరసన
NEWS Aug 18,2026 08:40 pm
రావికమతం మండలం బుడ్డిబంద గిరిజన రెవెన్యూ గ్రామంలో ఉపాధి పని కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీలు కంచాలు పట్టుకుని వినూత్నంగా నిరసన చేపట్టారు. గ్రామంలో 56 గిరిజన కుటుంబాలు ఉన్నాయని, పెద్దేరు రిజర్వాయర్ నీరు రాక పంటలు ఎండిపోయాయని తెలిపారు. తక్షణమే V-BGRAM-G పథకం కింద పనులు కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కే.గోవిందరావు డిమాండ్ చేశారు.