చోడవరం బానయ్యకోనేరులో 30 రోజులుగా వీధిలైట్లు వెలగక, వారం రోజులుగా మంచినీటి సరఫరా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు తెలిపారు. రాత్రి ప్రాంతాన్ని సందర్శించి సమస్యలు తెలుసుకున్నారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని, లేకుంటే పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.