కూటమి ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియను ఎక్కడా ఎటువంటి జాప్యం లేకుండా 148 రోజుల్లో పూర్తి చేసి రికార్డు సృష్టించాం. విద్యా రంగ చరిత్రలోనే ఇదొక మైలురాయి అన్నారు మంత్రి నారా లోకేష్. మెగా డీఎస్సీపై శాసనసభలో మంత్రి లోకేశ్ పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. 2019-24 మధ్య ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదన్నారు. మెగాడీఎస్సీ ప్రక్రియను 148 రోజుల్లో పూర్తి చేశామన్నారు లోకేశ్.