వైసీపీ నేత అంబటి మురళిపై పరువు నష్టం దావా
NEWS Aug 17,2026 02:31 pm
పొన్నూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త, వైసీపీ నేత అంబటి మురళిపై పరువు నష్టం దావా వేశారు టీడీపీ నేత, ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర. రూ.5 కోట్లకు MLA ధూళిపాళ్ల పరువు నష్టం దావా దాఖలు చేశారు. తన పరువుకు భంగం కలిగించేలా ప్రచారం చేశారని దావాలో ఆయన ఆరోపించారు. గుంటూరు అడిషనల్ ఫ్యామిలీ కోర్టులో ఈ దావా దాఖలయింది. అంబటి మురళీకృష్ణ తో పాటుగా సాక్షి మీడియాలో పనిచేసే పలువురు వ్యక్తులను కూడా పార్టీలుగా చేర్చారు.