డైరీ భూముల మార్పిడిపై రైతుల ఆగ్రహం
NEWS Aug 17,2026 02:30 pm
కరీంనగర్: ధరణి పోర్టల్లో కరీంనగర్ డైరీ పేరిట ఉన్న భూములను తమకు తెలియకుండా తెలంగాణ ఫెడరేషన్ పేరిట మార్చడాన్ని నిరసిస్తూ పాడి రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు. నగర వీధుల గుండా సాగిన ఈ ప్రదర్శన కలెక్టరేట్ వద్దకు చేరుకుంది. భూ మార్పిడిపై కలెక్టర్, ప్రభుత్వం వెంటనే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేశారు.