సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడాలి: CPM
NEWS Aug 15,2026 05:13 pm
కరీంనగర్: స్వాతంత్య్ర సమరయోధుల స్ఫూర్తితో సామ్రాజ్యవాదం, దోపిడీకి వ్యతిరేకంగా పోరాడాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి పిలుపునిచ్చారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం ముకుంద లాల్ మిశ్రా భవన్ వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో స్వేచ్ఛ, సమానత్వం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.