రూ.40.55 లక్షల సీఎం సహాయ నిధి
NEWS Aug 15,2026 05:18 pm
కే.కోటపాడు: కే.కోటపాడు తహసీల్దార్ కార్యాలయంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి జాతీయ జెండాను ఆవిష్కరించారు. 4 మండలాలకు చెందిన 66 మంది అనారోగ్య బాధితులకు సీఎం సహాయ నిధి కింద రూ.40,55,958 విలువైన చెక్కులను అందజేశారు. అలాగే 20 ఆలయాలకు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా మంజూరైన రూ.6 కోట్ల విలువైన ఆర్డర్ కాపీలను గ్రామ నాయకులకు అందించారు.