ఈనెల 16న విజయవాడలో టీచర్ల ఆత్మగౌరవ ర్యాలీ
NEWS Aug 15,2026 02:40 pm
మెగా డీఎస్సీ-2025 నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ వైఎస్సార్సీపీ చేస్తున్న అసత్య ఆరోపణలను ఖండిస్తూ, ఎంపికైన ఉపాధ్యాయులు ఆగస్టు 16న విజయవాడలో భారీ 'ఆత్మగౌరవ ర్యాలీ'కి సిద్ధమయ్యారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి అంబేడ్కర్ స్మృతివనం వరకు ఈ ర్యాలీ నిర్వహించి, తమ ప్రతిభను కించపరిచేలా మాట్లాడవద్దని డిమాండ్ చేయనున్నారు.డీఎస్సీ నియామకాలు, మెరిట్ జాబితాలు, స్పోర్ట్స్ కోటా ప్రక్రియలపై ప్రతిపక్షం తీవ్ర విమర్శలు చేస్తోంది. వీటిని తిప్పికొడుతూ రాష్ట్రవ్యాప్తంగా డీఎస్సీలో ఉద్యోగాలు పొందిన టీచర్లు ర్యాలీలు నిర్వహించారు.