‘స్త్రీ శక్తి’ ఉచిత బస్ ప్రయాణానికి ఏడాది పూర్తి
NEWS Aug 15,2026 02:36 pm
ఆంధ్రప్రదేశ్లో మహిళల ఆర్థిక సాధికారతకు ఉద్దేశించిన ‘స్త్రీ శక్తి’ ఉచిత బస్సు ప్రయాణ పథకం ఏడాది పూర్తి చేసుకుంది. 2025 ఆగస్టు 15న ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఇప్పటివరకు మహిళలు 87 కోట్ల ఉచిత ప్రయాణాలు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. రోజుకు సగటున 24 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. మహిళల ప్రయాణానికి ప్రభుత్వం రోజుకు సుమారు రూ.8.53 కోట్ల సబ్సిడీ అందిస్తోంది. పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు రూ.3,095 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు వెల్లడించారు.