రైతుల పిల్లలకు డీసీసీబీ నగదు పురస్కారాలు
NEWS Aug 15,2026 01:16 pm
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రైతుల పిల్లలను ప్రోత్సహించేందుకు డీసీసీబీ విశాఖపట్నం ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు పురస్కారాలు, సర్టిఫికెట్లు అందజేశారు. తురకలపూడి పీఏసీఎస్లో బుదిరెడ్డి కళావతి, కృష్ణ దంపతుల కుమారుడు వసంత్ కుమార్కు చైర్పర్సన్ కోట సత్యనారాయణ చెక్కు, సర్టిఫికెట్ అందజేసి అభినందించారు. డైరెక్టర్ కందా మూర్తిరావు, సీఈఓ మలిచెట్ల సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.