బీజేపీ క్షమాపణ చెప్పాలి
NEWS Aug 14,2026 11:56 pm
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పట్ల బీజేపీ నాయకులు వ్యవహరించిన తీరును నిరసిస్తూ హనుమకొండ డీసీసీ ఆధ్వర్యంలో సత్యాగ్రహ నిరసన చేపట్టారు. వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుతో కలిసి పాల్గొన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను అవమానించడం ఒక వ్యక్తిని అవమానించడం కాదని, దేశంలోని దళితులు, గిరిజనుల ఆత్మగౌరవాన్ని అవమానించడమేనని పేర్కొన్నారు.