అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ
NEWS Aug 14,2026 11:52 pm
నిజాయితీగా ఉంటూ అభివృద్ధి చేసే వారికి ప్రజల సహకారం ఉండాలని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఘనపూర్ మండలం తాటికొండ గ్రామంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ రహదారి నుండి మల్లన్న గండి వరకు 15కోట్లతో నిర్మించిన బిటీ, 30లక్షలతో నిర్మించిన అంతర్గత సిసి రోడ్లతో పాటు గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించారు. 30లక్షలతో నిర్మించనున్న 3వివో భవనాల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు.