నకిలీ వెబ్సైట్లు,వాట్సాప్ మెసేజ్లతో జాగ్రత్త
NEWS Aug 14,2026 03:17 pm
తిరుమలకు వచ్చే లక్షలాదిమంది భక్తుల్ని ఎలాగైనా మోసం చేయాలని కేటుగాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో నకిలీ వెబ్సైట్లు, వాట్సాప్ మెసేజ్ల పట్ల భక్తులకు టీటీడీ సూచనలు చేసింది. అధికారిక మార్గాల్లోనే దర్శనాలు, సేవల బుకింగ్ చేసుకోవాలని సూచించింది. టీటీడీ పేరు, లోగో, చిత్రాలు, ట్రేడ్ మార్క్ లను ను ఉపయోగిస్తూ నకిలీ వెబ్సైట్లు వీరవిహారం చేస్తున్నాయి. ఐటీ, విజిలెన్స్, సైబర్క్రైమ్ పోలీసుల సమన్వయంతో ప్రత్యేక నిఘా ఏర్పాటుచేశామని టీటీడీ అధికారులు చెప్పారు. గత రెండేళ్లలో 259 నకిలీ వెబ్సైట్లను తొలగించింది టీటీడీ ఐటీ టీమ్. నకిలీ వెబ్సైట్ల పట్ల భక్తులు జాగ్రత్తగా ఉండాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ఏవైనా అనుమానాలుంటే టీటీడీ తెలియచేయాలని టీటీడీ సూచించింది.